TG Politics: తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్‌ గా సీపీ రాధాకృష్ణన్‌

0
23

తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళి సై సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణ గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

సీపీ రాధాకృష్ణన్‌ తమిళనాడుకు చెందిన వారు. కోయంబత్తూరు నుండి రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్‌ గవర్నర్ గా ఎన్నికయ్యారు. గవర్నర్ గా తమిళిసై 2019 సెప్టెంబర్ 8న బాధ్యతలు చేపట్టగా.. 4 ఏండ్ల 6 నెలల 10 రోజుల పాటు పనిచేశారు. గవర్నర్ గా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత కాలం గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం, గవర్నర్ మధ్య మంచి వాతావరణమే కొనసాగింది.

కాగా, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నందున తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడు లోని కన్యాకుమారి లేదా తిరునల్వేలి లేదా చెన్నై సౌత్ లేదా పుదుచ్చేరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. బీజేపీ సైతం మెజారిటీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. త్వరలో పెండింగ్ లో ఉన్న సీట్లకు క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉన్నందున , రాజీనామాకు బీజేపీ హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే తమిళిసై పదవి నుంచి వైదొలిగినట్టు సమాచారం.