Tdp And Janasena: ఈ నెల17న టీడీపీ- జనసేన భారీ బహిరంగ సభ

0
14

టీడీపీ- జనసేన ఆధ్వర్యంలో మార్చి 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దాదాపు 10 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన PAC ఛైర్మన్ మనోహర్ వెల్లడించారు. ఈ సభలో ఉమ్మడి మేనిఫెస్టో. భవిష్యత్ కార్యాచరణను చంద్రబాబు. పవన్ ప్రకటిస్తారని వెల్లడించారు. బీజేపీతో పొత్తుపై స్పష్టత వచ్చాక రెండో జాబితాను వెల్లడిస్తామని తెలిపారు.

మరో వైపు ఢిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బిజిబిజీగా గడుపుతున్నారు. నిన్న చంద్రబాబు నడ్డా, అమిత్ షాతో వరుసగా భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంపై చర్చలు జరిపినట్లు తెలిసింది. సీట్ల సర్దుబాటు అంశంపై బీజేపీ నాయకత్వంతో మాట్లాడారు. ఇవాళ మరోసారి బీజేపీ అగ్రనేతలో భేటీ కానున్నారు. పొత్తులు,సీట్ల సర్దుబాటుపై క్లారిటీతోనే రాష్ట్రానికి రావాలని చూస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ,జనసేన కలిసి పోటీచేయడం దాదాప ఖాయంగా తెలుస్తోంది. బీజేపీ ఐదు అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన 24 సీట్లలో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే..