AP Politics: పారిశుద్ధ్య కార్మికులను దూరం జరగమన్న మాజీ మంత్రి రోజా.. తీవ్రంగా ఖండించిన తేదేపా..!

0
36

పాయింట్ బ్లాంక్, వెబ్‌ డెస్క్: ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ(YSRCP) మాజీ మంత్రి రోజా(RK Roja) ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ ఊహించని విధంగా పరాజయం చవిచూసింది. ఈ క్రమంలో ఇటీవల మాజీ మంత్రి రోజా వ్యవహరిస్తున్న తీరు వల్ల తీవ్ర విమర్శల పాలవుతుంది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల కిందట తమిళనాడు(Tamil Nadu)లోని తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని రోజా తన భర్త సెల్వమణి(RK Selvamani)తో కలిసి దర్శించుకున్నారు. ఈ క్రమంలో పలువురు ఆమెతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ సమయంలోనే అక్కడే ఉన్న మరికొంతమంది పారిశుద్ధ్య కార్మికులు(Sanitation Workers) తాము కూడా సెల్ఫీ తీసుకుంటామని రోజాను అడిగారు.

కాగా, వారిని మాత్రం దూరం జరగండి అని రోజా అన్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నట్లు వీడియోలో ఉంది. ఈ వీడియో చూసిన టీడీపీ ఆమె వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించింది. పారిశుద్ధ్య కార్మికులంటే అంత చులకనా..? అని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ వీడియోలో రోజా వ్యవహరించిన తీరును చూసి నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజలతో ఇలా దూరం వ్యవహరించడం వల్లే ఆమె మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్ర

స్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..