Telangana: ఇవాళ, రేపు జాగ్రత్త.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

0
13

తెలంగాణలో ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రాత్రి సమయంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. పలుచోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆదివారం పలు జిల్లాల్లో టెంపరేచర్లు కొద్దిగా తగ్గాయి. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో గత రెండు రోజులపాటు 43 డిగ్రీల టెంపరేచర్లు నమోదు కాగా.. ఆదివారం 42 డిగ్రీల వరకు రికార్డ్​ అయ్యాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నిజామాబాద్​, నిర్మల్ లో 42.3, వనపర్తిలో 42.2, కుమ్రంభీం ఆసిఫాబాద్​లో 41.8, కామారెడ్డి, నాగర్​కర్నూల్ లో 41.7, మహబూబ్​నగర్​, రాజన్న సిరిసిల్లలో 41.4, భద్రాద్రి కొత్తగూడెం 41.3, సూర్యాపేటలో 41.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 39 నుంచి 41 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డు అయ్యాయి.