Telangana ACB: గొర్రెల స్కాంలో మరో నలుగురికి నోటీసులు

0
16

గొర్రెల కుంభకోణంలో పశు సంవర్ధక శాఖకు చెందిన మరో నలుగురు అధికారులకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు ఉంటాయని ఏసీబీ వర్గాల వెల్లడించాయి. గొర్రెల పంపిణీ పథకంలో దాదాపు. 2.12 కోట్ల నిధులు విక్రయందారుల ఖాతాల్లోకి కాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లో జమ అయినట్టుగా విచారణాధికారులు గుర్తించారు.

ఈమేరకు నమోదైన కేసును విచారిస్తున్న ఏసీబీ అధికారులు ఇటీవల పశు సంవర్ధక శాఖ రంగారెడ్డి జిల్లా డైరెక్టర్ డాక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణయ్యలను అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ నలుగురు నిందితులు విచారణలో గొర్రెల స్కాంలో ప్రమేయం ఉన్న మరికొందరి పేర్లను వెల్లడించడంతో మరో నలుగురు అధికారులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని ఏసీబీ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ కేసులో అరెస్టయిన నిందితుల ఆస్తులపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.