BREAKING : తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల

0
18

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. పది ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు, బాలుర కంటే 3.81 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. 3927 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 99 శాతం ఫలితాలతో నిర్మల్ జిల్లా టాప్‌లో నిలవగా.. 65.10 శాతం ఫలితాలతో చివరి స్థానంలో వికారాబాద్ నిలిచింది. ఇందులో 49.73శాతం ప్రైవేటు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక, జూన్ 3 నుంచి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. టెన్త్ పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో బాలురు 2,7,952 మంది ఉండగా బాలికలు 2,50,433 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహించారు. ఫలితాల కొరకు ఈ లింక్ క్లిక్ చేయగలరు. https://results.bsetelangana.org/

అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు:
అలానే టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 3 నుంచి 13 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల టైమ్ టేబుల్‎ను విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధింత పాఠశాలల్లో మే 16వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు.

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్:
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఇవాళ్టి నుంచి 15 రోజుల్లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రీ కౌంటింగ్‎కు రూ.500, రీ వెరిఫికేషన్‎కు రూ. 1000 రుసుము నిర్ణయించారు.