TG Politics: తెలంగాణలో మరో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్?

0
11

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న 13 స్థానాల్లో ఆరింటిపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. బుధవారం లేదా గురువారం రిలీజ్ కానున్న లిస్ట్​లో తెలంగాణ లోని 6,7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉంది. మిగిలిని సెగ్మెంట్ పై సీఈసీలో ఏకాభిప్రాయం రాకపోవడంతో వాటిని పెండింగ్ లో పెట్టనున్నట్టు సమాచారం.

సీఈసీ భేటీలో తెలంగాణలోని పలు లోక్​సభ స్థానాలకు ఫైనల్ అయ్యాయంటూ ఏఐసీసీ వర్గాల్లో కొంతమంది నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. నిజామాబాద్-జీవన్ రెడ్డి, పెద్దపల్లి-గడ్డం వంశీ, చేవెళ్ల- రంజిత్ రెడ్డి, ఆదిలాబాద్- డాక్టర్ సుమలత, కరీంనగర్ – ప్రవీణ్ రెడ్డి, సికింద్రాబాద్ – దానం నాగేందర్, వరంగల్ – పసునూరి దయాకర్, భువనగిరి – పైళ్ల శేఖర్ రెడ్డి, హైదరాబాద్ – షానవాజ్ కు దక్కవచ్చని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

అయితే మెదక్, ఖమ్మం, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాలకు పోటీ ఎక్కువగా ఉంది. దీంతో ఈ స్థానాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి నెక్స్ట్​ సీఈసీ భేటీలో అభ్యర్థులను నిర్ణయించనున్నట్లు తెలిసింది. కాగా తెలంగాణకు సంబంధించి ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే