TG Politics: ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటుకు బీఆర్ఎస్ రెడీ

0
11

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అన ర్హత వేటు వేయించేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంక టేష్, ముఠా గోపా ల్ వెళ్లారు. ఆరు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చి రాత్రి ఎనిమిదిన్నర దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ ప్రసాద్ కుమార్ కలవలేదు. ఇంట్లో లేకపోవడంతో స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు ఫోన్ చేసినా స్పందించలేదని వెల్లడించారు.

దాదాపు రెండున్నర గంటలు స్పీకర్ నివాసం వద్ద నిరీక్షించి చివరికి వెను దిరిగారు. స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చి తమను కలవక పోవడం బాధాకరమ ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తోనే స్పీకర్ తమ ను కలవలేదని ఆరోపించారు. నేడు మరోసారి స్పీకరు దానం నాగేందర్ పై అన ర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు ప్రయత్నించనున్నట్లు ఎమ్మెల్యే. కౌశిక్ రెడ్డి తెలిపారు.

కాగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్ దానం నాగేందర్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేవెళ్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్ ఆఫర్ చేసిందని ప్రచారం జరుగు