TG Politics: బాబు మోహన్ కు కేసీఆర్ ఫోన్..

0
10

వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాబు మోహన్ ను బరిలోకి దింపాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తరపున పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రకటించిన కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో.. పార్టీ అధిష్టానం డైలమాలో పడింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధిగా బాబు మోహన్ ను బరిలో దించాలని ప్రయత్నిస్తుంది. ఈ విషయమై స్వయంగా కేసీఆరే బాబూ మోహన్‌కు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది.

ఎన్నికల షెడ్యూల్‌కు ముందు బీజేపీ నుంచి టికెట్ ఆశించిన బాబూ మోహన్.. టికెట్ రాదన్న విషయం తెలిసి ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరారు

ప్రజాశాంతి పార్టీ నుంచి వరంగల్‌ లో పోటీచేసేందుకు సిద్దమయ్యారు బాబు మోహన్. అయితే నిన్న రాత్రి బీఆర్ఎస్‌లో జరిగిన అనూహ్య పరిణామల దృష్ట్యా బాబూ మోహన్‌కు కేసీఆర్ ఫోన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల్లో ఆయనకు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.