IPL 2024: టీ20ల్లో కోహ్లీ మరో రికార్డ్..

0
24

రన్ మిషన్ కోహ్లీ ఐపీఎల్ లో మరో రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక క్యాచ్ లు పట్టిన ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు సురేష్ రైనా 172 పరుగులతో ఉండగా..నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ రైనాను అధిగమించాడు. దీంతో ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే ఈ ఫార్మాట్లో వంద 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.

నిన్న పంజాబ్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఆరంభంలోనే మహ్మద్ సిరాజ్, జానీ బెయిర్‌స్టో వికెట్లు తీసి షాక్ ఇచ్చారు. సిరాజ్ వేసిన బంతిని సిక్సర్ కొట్టే ప్రయత్నంలో బెయిర్ స్టో కింగ్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.బెయిర్‌స్టో క్యాచ్ పట్టడం ద్వారా విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో తన 173వ క్యాచ్‌ని పూర్తి చేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. సురేష్ రైనా తన టీ20 కెరీర్‌లో 172 క్యాచ్‌లు పట్టాడు. ఇప్పుడు రైనా రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ మొదటి స్థానానికి చేరుకోగా.. 167 క్యాచ్‌లు పట్టిన రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు..

మొదటి మ్యాచ్ చెన్నైతో ఓటమి పాలైన బెంగళూరు నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెంగళూరు బ్యాట్స్ మెన్ కోహ్లీ, దినేశ్ కార్తీక్ చెలరేగడంతో మ్యాచ్ గెలిచింది. ఆడిన రెండు మ్యాచుల్లో బెంగళూరు ఒకటి ఓడి..ఒకటి గెలిచింది.