Who Is Race Horse’s: గెలుపు గుర్రాలెవరు?అభ్యర్థుల వేటలో కాంగ్రెస్

0
11

తెలంగాణలో గెలుపు గుర్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నాలుగు స్థానాలను ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన 13 స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపితే గెలుస్తారా? అని ఆరాదీస్తోంది.ఏఐసీసీ రాష్ట్ర ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఈ నెల 15న సాయంత్రం ఢిల్లీలో సీఈసీ మీటింగ్ జరగనుంది. బుధవారమే ఈ మీటింగ్ జరగాల్సి ఉండగా.. ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే కర్నాటక టూర్ లో, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తున్నది. ఈ నెల 15న జరగనున్న మీటింగ్ తర్వాత తెలంగాణకు సంబంధించి 4 లేదా 5 సీట్లకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది.

హైదరాబాద్ టికెట్ కోసం అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మెహన్, మెదక్ నుంచి నిర్మల జగ్గారెడ్డి, భవాని రెడ్డి పోటీపడుతున్నారు. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. వీరంతా నిన్న దీపాదాస్ మున్షీతో గాంధీభవన్ లో సమావేశమయ్యారు.