MOHAMMED IQBAL : టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

0
14

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. అధికార పక్షం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన హిందూపురం నియోజకవర్గం సీనియార్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అయితే మహమ్మద్ ఇక్బాల్ సీనియార్ నేత మాత్రమే కాదు, ఆయన ఒక మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో చంద్రబాబుకు ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‎గా కూడా పనిచేశారు. తర్వాత కాలంలో రాజకీయ ప్రవేశం చేసి టీడీపీలో చేరారు ఇక్బల్. తర్వాత టీడీపీలో నుంచి వైసీపీలోకి చేరారు. కాగా, మహమ్మద్ ఇక్బాల్ ఇప్పుడు వైసీపీ నుంచి హిందూపురం అసెంబ్లీ టికెట్ ఆశించగా, ఆయనకు నిరాశ తప్పలేదు. హిందూపురం అసెంబ్లీ ఇన్‎ఛార్జ్‎గా ఉన్న ఇక్బాల్‎ను తప్పించడమే కాకుండా, ఆయనకు ఇతర పదవులేవీ కేటాయించలేదు వైసీపీ అధిష్టానం. అప్పటి నుంచి వైసీపీ అన్ని కార్యక్రమాలకి ఇక్బాల్ దూరంగా ఉన్నారు. దీంతో వైసీపీ నుంచి టికెట్ రాని అసంతృప్తితో ఉన్న మహమ్మద్ ఇక్బాల్ ఇవాళ చంద్రబాబు సమక్షంలో తిరిగి మళ్ళీ టీడీపీ గూటికి చేరుకున్నారు.