YS SHARMILA : ఏపీలో సీఎం జగన్‎ను ఓడించాలి- వైఎస్ షర్మిల

0
18

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ప్రచారం అప్పడే జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఇవాళ కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం వారిద్దరూ ఏపీ పొలిటక్స్ గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఈ సారి సీఎం జగన్‎ను ఓడించి.. కాంగ్రెస్‎ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే విషయంపై డీకేతో షర్మిల చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రచారంలో చేపట్టాల్సిన ర్యాలీలు, సభల నిర్వహణపై వైఎస్ షర్మిల, డీకేకు వివరించారు. ఇక పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో వ్యవహరించాల్సిన తీరును షర్మిలకు దిశానిర్దేశం చేశారు డీకే శివకుమార్.